“సమరం” ట్రైలర్ చూసి… కథాంశం ఊహించిన వారికి రూ.50 వేలు బహుమానం

1132

యూనివర్సల్ ఫిలిమ్స్ పతాకంపై గందం విద్యాసాగర్ నిర్మాతగా బషీర్ అల్లూరి దర్శకత్వంలో సాగర్, ప్రజ్ఞ నయన్ హీరో హీరోయిన్లు గా సుమన్ , వినోద్ కుమార్ తదితరులు ప్రధాన తారాగణం లో రూపొందిన చిత్రం ‘సమరం’. ఈ నెల 25న ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యం ఇటీవలే విడుదల చేసిన చిత్ర ట్రైలర్ కు అనూహ్య స్పందనను పెంపొందుతోంది.. ఉత్కంఠభరితమైన ఈ సమరం ట్రైలర్ ను చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా కథాంశం ఇంకెంత థ్రిల్ ను క్రియేట్ చేస్తుందోనని కామెంట్స్ రూపంలో పేర్కొంటున్నారు. ఈ సందర్బంగా.. సమరం చిత్ర దర్శక నిర్మాతలకు ఓ నూతన ఆలోచన కలిగి మా ‘సమరం’ చిత్ర ట్రైలర్ చూసి ఈ నెల 25 వ తేదీలోపుగా అనగా సమరం సినిమా విడుదల రోజు లోపుగా కథాంశం ఎలా ఉండబోతోందని ఊహించి http://bit.ly/ samaramMovieContest లేదా universalfilmshyd@gmail.com వెబ్ సైట్ లకు లాగిన్ అయ్యి సరైన కథనాన్ని పంపిన వారికి 50,000 వేల నగదును బహుమతిగా అందచేయాలని నిర్ణయించుకొని ఈ కాంటెస్ట్ ను నిర్వహించారు. ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.

ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జులై 25 వ తేదీన ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు చేరువ కానుంది. క్రైమ్, సస్పెన్సు తో సాగే ఈ చిత్రంలో సాగర్, ప్రజ్ఞా నయన్, సుమన్, వినోద్ కుమార్, సత్య ప్రకాష్, రామ్ జగన్, ప్రియాంశ, ప్రభావతి, రాగిణి, జబర్దస్త్ అప్పారావు, చిట్టి బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: గందం విద్యాసాగర్, దర్శకుడు: బషీర్ అల్లూరి, ఎడిటర్: ఎన్. శ్రీను బాబు, డిఒపి: కె. నాగబాబు, మ్యూజిక్: రాజ్ కిరణ్.