*థియేటర్లన్నీ నవ్వులతో నిండిపోవడం నాకు చాలా సంతృప్తినిచ్చింది.విజయ్ దేవరకొండ*

842


తరుణ్‌ భాస్కర్‌ హీరోగా షామీర్ సుల్తాన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి థియేటర్స్ ని నవ్వులతో నింపేస్తుంది. ఈ “ఫన్ స్టాస్టిక్” సెలెబ్రేషన్స్ ని మీడియా తో పంచుకుంది చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ మాట్లాడుతూ :

“హీరో గా స్టార్ డమ్ లో ఉండగా కొత్త వాళ్ళ ను ప్రోత్సాహించడానికి విజయ్ చేసిన ప్రయత్నం ఒక ఎగ్జామ్ పుల్ నిలుస్తుంది. టీం అందరికీ థాంక్స్. మా ప్రయత్నం ఒక విజయం గా మార్చిన ప్రేక్షకులకు థాంక్స్” అన్నారు

మ్యూజిక్ దర్శకుడు శివకుమార్ మాట్లాడుతూ :
“థియేటర్స్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు షమ్మీర్ , నిర్మాత విజయ్ కి థాంక్స్” అన్నారు.

దర్శకుడు షామీర్ సుల్తాన్ మాట్లాడుతూ: “అందరికి థ్యాంక్యూ. అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. నిన్న మూడు థియేటర్లకు వెళ్లాం. ప్రేక్షకులందరి ముఖాల్లో నవ్వులు విరిస్తున్నాయి. దీని కోసమే రెండేళ్లు కష్టపడ్డాను. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పడం కూడా తక్కువే. రైటింగ్ లో తరుణ్ నాకు చాలా సహకరించారు. అభినవ్ యాక్టింగ్ కు ప్రేక్షకులు తెగనవ్వేస్తున్నారు. ఇంత నవ్వుకోడానికి నా కోడైరెక్టర్ అర్జున్ కారణం. నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఒక సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. ” అన్నారు.

అభినవ్ గోమటం మాట్లాడుతూ:
“ఈ సినిమాకు హీరో షామీర్ . నిన్న థియేటర్లలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే మేం ముందు అనుకున్నది నిజమైంది. మా రౌడి బాయ్స్ , గళ్స్ కు చాలా థ్యాంక్స్ . వాళ్ల వల్లే సినిమా బాగా ఆడుతుంది.” అన్నారు

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ: “నిన్న నాకు చాలా మంచి రోజు. ప్రేమతో ఇష్టంతో చేసే పనిలో దేవుడు ఉంటాడు. ఆ పని విజయవంతమవుతుంది. ఆ ఇష్టంతో విజయ్ చేసిన పనికి మంచి రిజల్ట్ వచ్చింది. ప్రేక్షకులు రెండు గంటలు పగలపడి నవ్వుతున్నారు. ఈ మూమెంట్ ను నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్యూ. విజయ్ ఎప్పుడు డైరెక్షన్ చేయాలనుకున్నా నేను నిర్మాతగా ఉంటా.” అన్నారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ:
” ఫంటాస్టిక్స్ సెలబ్రేషన్స్ కు చాలా కారణాలున్నాయి. మా అందరి కలలు నిజమయ్యాయి. వికీపిడియాలో కొడితే ఒక్కొక్కరికి పేరు ఉంటుంది. సినిమా ఇండస్ర్టీలో నిర్మాతగా అడుగుపెడితే చోటు దొరుకుతుందా లేదా అనుకున్నా. నైజాంలో 80 శాతం థియేటర్లు ఫుల్స్ అయ్యాయి. వీటన్నింటికంటే థియేటర్లన్నీ నవ్వులతో నిండిపోవడం నాకు చాలా సంతృప్తి నిచ్చింది. పెళ్లిచూపులు కంటే ఈ సినిమాకు నాలుగింతలు బడ్జెట్ ఎక్కువ. మన లైఫ్ లు ఈ రోజుల్లో ఎంతో ఒత్తిడికి గురవుతున్నాయి. నేను ప్రతి వీకెండ్ కోసం ఎదురుచూస్తుంటా. శని, ఆదివారాల్లో ఎంజాయ్ చేస్తే నేక్స్ట్ వీక్ బాగా పనిచేస్తా. థియేటర్లలో సినిమా చూసి నవ్వే ప్రేక్షకులు నేను బాగుండాలని దీవించండి. సృజన్ అనే మరో నూతన దర్శకుడితో నా బ్యానర్ లో మరో సినిమా ఉంటుంది. వెంటవెంటనే సినిమాలు తీయను. ఆలోచించి మంచి టాలెంట్ టీంతో సినిమాలు తీస్తా.” అన్నారు.

నటీనటులు :
తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్ తో పాటు అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, సంగీతం : శివకుమార్,
ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్,
కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ,
పిఆర్.వో : జి.ఎస్.కె మీడియా,
లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి,
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతినేని,
నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ.
రచన- దర్శకత్వం : షామీర్ సుల్తాన్.