సినీ గోయర్స్ 52వ గోల్డెన్ జూబిలీ అవార్డ్స్ లోగో మరియు ప్రోమో విడుదల

524


1970 నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎంతోమంది గొప్ప నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులకు సినీ గోయర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకరమైన సినీ గోయర్స్ అవార్డు తో గౌరవించి సత్కరించారు. ఇప్పుడు 2019 – 2020 సంవత్సరం విడుదల అయినా సినిమాలకు సినీ గోయర్స్ అవార్డు లతో నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులను సత్కరించాలి అని సన్నాహాను చేస్తున్నారు. ఆ వివరాలనే తెలియజేయటానికి హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 51 వసంతాలు పూర్తిచేసుకుని 52 వ గోల్డెన్ జూబిలీ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న తరుణంలో జనరల్ సెక్రటరీ గా వేవహరిస్తున్న బి. రామకృష్ణ గారు ఈ 52 వ అవార్డు కార్యక్రమం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కి తెలంగాణ గవర్నమెంట్ సలహాదారుడు డాక్టర్ కె వి రమణ గారు మరియు జి హెహ్ ఎమ్ సి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. అలాగే తెలుగు సినిమా దర్శకులు త్రినాథ రావు నెక్కిన, ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ మొండిటొక అరుణ్ కుమార్ మరియు కె ఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఏం వి శాస్త్రి ప్రెస్ మీట్ కి విచ్చేసారు.

ఈ సందర్బంగా సినీ గోర్లు జనరల్ సెక్రటరీ బి రామకృష్ణ గారు మాట్లాడుతూ “మా నాన్న గారు ఎంతో కష్టపడి సినీ గోయర్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు ను స్థాపించారు. ఇప్పడు గోల్డెన్ జూబిలీ సంవత్సరం లోకి అడుగు పెడుతుంది. ఈ 52 వ అవార్డు ఫంక్షన్ ను చాలా గొప్పగా నెక్స్ట్ లెవెల్ లో నిర్వహించాలి అని అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ జరుపుతాం, తెలుగు చలన చిత్ర సీమ ఉన్నత కాలం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాం. తెలుగు లో 52 సంవత్సరాలుగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ మా సినీ గోయర్స్ అవార్డ్స్. మాకు ఎంతో సహాయసహకారాలు అందిస్తున్న మెగా స్టార్ చిరంజీవి గారికి నా ధన్యవాదాలు. సెప్టెంబర్ లో 52 వ అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తాం. అవార్డు క్యాటగిరీ మరియు నొమినీ లిస్ట్ ను ఆన్ లైన్ లో పొందుపరిస్తాము. ఆన్ లైన్ ద్వారానే ఓటింగ్ ఉంటుంది. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాం” అని తెలిపారు.

జి హెహ్ ఎమ్ సి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ “రామకృష్ణ గారి నాన్న గారు స్థాపించిన సినీ గోయర్స్ ని ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. సినిమాలు చుస్తే మంచి రిలీఫ్ ఉంటుంది, అందులో పనిచేసే నటీనటులకు టెక్నిషన్స్ ని సినీ గోయర్స్ అవార్డు తో సత్కరించడం చాలా గొప్ప విషయం. ఎంతో ప్రతిష్టాత్మకమైన 52 వ సినీ గోయర్స్ లోగో విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది” అని తెలిపారు.

సినీ గోయర్స్ జాయింట్ సెక్రటరీ రాజేష్ పొన్నాడ గారు మాట్లాడుతూ “సెప్టెంబర్ లో 52 వ గోల్డెన్ జూబిలీ సినీ గోయర్స్ అవార్డు ఫంక్షన్ ను నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నాం. రేనోవా హాస్పిటల్స్ వారు మా కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్ గా ఉన్నారు. 52 వ గోల్డెన్ జూబిలీ సినీ గోయర్స్ అవార్డు ఫంక్షన్ ని భారీ గా ప్లాన్ చేస్తున్నాం. అందరు సపోర్ట్ చేయాలి” అని కోరుకున్నారు.

తెలంగాణ గవర్నమెంట్ సలహాదారుడు డాక్టర్ కె వి రమణ గారు మాట్లాడుతూ ” సినీ గోయర్స్ అవార్డ్స్ తో నాకు 40 సంవత్సర అనుబంధం ఉంది. కిషన్ గారు ఎలా అయితే అవార్డు ఫంక్షన్ కి కృషి చేసారో అలాగే వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారు కూడా కృషి చేస్తున్నారు. మన తెలుగు 52 వసంతలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ సినీ గోయర్స్. రామకృష్ణ ని మరియు ఈ సినీ గోయర్స్ ని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ లో జరిగే ఫంక్షన్ అద్భుతంగా జరగాలి” అని కోరుకున్నారు.

సినిమా దర్శకుడు త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ “నేను చిన్నపుడు ఒక ఆడియన్స్ గా సినీ గోయర్స్ అవార్డు ఫుసిన్షన్ కి వెళ్ళేవాడిని, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడం చాలా ఆనందంగా ఉంది. 52 సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహించడం అంటే చాలా కృషి కావాలి, మరి అంత కృషి ఉన్న రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు ఫంక్షన్ మంచి సక్సెస్ అవ్వాలి ” అని కోరుకున్నారు.

52nd Cine Goers Awards

Pavan Kumar

9849128215

Film Reporter