వెంకట్రామ్ పల్లా ద‌ర్శ‌క‌త్వంలో ‘ నీకై అభిసారికనై` చిత్రం ప్రారంభం!!

584

అనీషా క్రియేషన్స్ పతాకంపై బాలాజీ సమర్పణలో సుగుణ.ఒ నిర్మాతగా సాయిబాబు, ఆషీరాయ్, సుర‌య పర్వీన్‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతోన్న చిత్రం ‘ నీకై అభిసారికనై’. సీనియర్ ఎడిటర్ వెంకట్రామ్ పల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశం చిత్రీకరణతో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి సంధ్యా మోషన్ పిక్చర్స్ ఎండి శ్రీ రవి కనకాల క్లాప్ నివ్వగా ప్రముఖ దర్శక నిర్మాత మద్ది నేని రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్రామ్ పల్లా మాట్లాడుతూ – “ఈరోజు మా సినిమా ప్రారంభోత్సవం జరగడం హ్యాపీ గా ఉంది. అందరూ కొత్త వారితో ఈ సినిమా చేస్తున్నాము. ఏకధాటిగా 15రోజుల పాటు మొయినాబాద్ పరిసర ప్రాతాలలో షూటింగ్ జరుపనున్నాం. రాజ్ కిరణ్ సంగీత సారథ్యంలో ఇప్పటికే 5పాటల రికార్డింగ్ పూర్తయ్యింది” అన్నారు.

సాయిబాబు, ఆషీరాయ్‌, సుర‌య పర్వీన్‌, కె. నెహ్రూ బాబు, బాలాజీ, నాగ‌బూష‌న్‌, రామ‌చంద్రా రెడ్డి, రాజు, పుట్టా గిరి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి
క‌థ‌, స్క్రీన్ ప్లే, పాట‌లు, ఎడిటింగ్‌, ద‌ర్శ‌క‌త్వం: వెంకట్రామ్ పల్లా,
నిర్మాత: సుగుణ. ఒ,
స‌మ‌ర్ప‌ణ‌: బాలాజి,
సంగీతం: రాజ్ కిరణ్,
మాటలు: పి.వి. రామారావు,
కో- డైరెక్ట‌ర్‌ : కె.ప్ర‌భాక‌ర్‌,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పుప్పురి రాజారాం,
కాస్టంగ్ డైరెక్ట‌ర్‌: సాయి ప్ర‌సాద్‌,
డాన్స్ : సుధాకర్,
పి ఆర్ ఓ: సాయి సతీష్.