త్రిషకు ఇంకా .. అంత సీను ఉందంటారా?!

587

త్రిష తాజాగా ‘రాంగీ’ అనే సినిమాలో నటిస్తోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన ఆడి పాడిన ఈ ముద్దుగుమ్మ ‘రాంగీ’పై భారీ అంచనాలనే పెట్టుకుందట. త్రిషకు ఇంకా .. అంత సీను ఉందంటారా?! అని కుడా అంటున్నారు సినీ జనాలు. ‘రాంగీ’పై త్రిష ఆశలు కుడా భారీ స్థాయిలోనే ఉన్నాయట! కారణం దీనికి కథ, మాటలను ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ అందించడమే. ఆయన శిష్యుడు శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రాంగీ’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది పూర్తి యాక్షన్‌ ఓరియంటెడ్ కథా చిత్రం. ఫైట్స్‌ సన్నివేశాల్లో త్రిష డూప్‌ లేకుండా నటించేస్తోందట. కమర్షియల్ చిత్రాల హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న త్రిష ఇప్పుడు హీరోయిన్‌ సెంట్రిక్‌ చిత్రాల మీద దృష్టి పెట్టింది. నటి నయనతార లా త్రిష చేసిన హర్రర్‌ కథా చిత్రమే ‘నాయకి’. ఆ చిత్రం త్రిషను పూర్తిగా నిరాశ పరిచింది. ‘మోహిని’ చిత్రంతో మరో ప్రయత్నం చేసినా అదీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు.ప్రస్తుతం ఆ తరహా చిత్రాలే మరో మూడు త్రిష చేతిలో ఉన్నాయి. వాటిలో ‘పరమపదం విళైయాట్టు’, ‘గర్జన’ చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతున్నాయి. అయితే.. ’రాంగీ’ చిత్రాన్ని సెప్టెంబరు నెలలో తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.