సన్ రేస్ క్రియేషన్స్ బ్యానర్ పై తుమ్మల సత్యనారాయణ ప్రొడ్యూసర్ గా నీర్మించిన చిత్రం “హీరో ఆఫ్ ఇండియా” ఈరోజు

109

సన్ రేస్ క్రియేషన్స్ బ్యానర్ పై తుమ్మల సత్యనారాయణ ప్రొడ్యూసర్ గా నీర్మించిన చిత్రం “హీరో ఆఫ్ ఇండియా” ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ట్రైలర్ తెలంగాణ చాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ లాంచ్ చేయగా, మొదటి సాంగు తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు లాంచ్ చేశారు. రెండవ సాంగు లైన్ వెంకట సాయి గారు లాంచ్ చేశారు. తదనంతరం మాట్లాడిన వాళ్లు సినిమా గురించి చాలా గొప్పగా చేశారు. గొప్పగా తీశారు. అని చెప్పారు. ప్రధాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ సినిమా బాగా వచ్చింది తక్కువ రోజుల్లోనే చాలా గొప్పగా తీశారు. ఈ సినిమా బాగా ఆడాలని తన ఆనందం తెలియపరిచారు. అలాగే బసిరెడ్డి గారు మాట్లాడుతూ సినిమా చాలా చక్కగా తీశారు. మన తెలుగు సినిమా నేడు ప్రపంచ స్థాయిలో దూసుకుపోతుంది. మీ సినిమా కూడా అలా రిలీజ్ చేసి,మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, కొనియాడుతున్నానని, ఆశీర్వదించారు. లైన్ సాయి వెంకట గారు మాట్లాడుతూ, నేను ఈ వేదికపై ఇదే సినిమాను ప్రారంభోత్సవం చేసి మాట్లాడాను. నేను మాట్లాడిన విధంగానే సినిమా తొందరగా కంప్లీట్ చేసి, ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్ గారు ఎంతో చాకచక్యంగా సినిమాను రూపొందించి ఈ సాయికి తీసుకొచ్చినందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, ధన్యవాదాలు తెలిపారు. ఇక మిగతావారు కూడా సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. హీరో కిషోర్ తేజ మాట్లాడుతూ సినిమా చాలా కష్టపడి చేశాము. బాగా వచ్చింది. మీది అందరి సహకారంతో త్వరలో రిలీజ్ కాబోతుంది. అందుకు నిర్మాత గారికి నా ధన్యవాదాలు అని చెప్పారు.హైరోహిన్ అంకిత మూలర్ మాట్లాడుతూ సినిమాలో ఎంతో కష్టపడి చేశాను. మా కష్టానికి ఫలితంగా నేడు ట్రైలర్,ఆడియో సాంగులలో కనిపించింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది త్వరలో విడుదల కాబోతుంది కాబట్టి, నాకు చాలా ఆనందంగా ఉంది. అని నిర్మాతకు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత నిర్మాత తుమ్మల సత్యనారాయణ మాట్లాడుతూ నేను డబ్బు సంపాదించుకోవడానికి సినిమా తీయడం లేదు. ఏదో ఫ్యాషన్ గా సినిమా తీయాలని వచ్చాను. వచ్చినందుకు చక్కగా ప్లాన్ చేసి సినిమా తీశాను దానికి డైరెక్టర్ట్ తో పాటు టీమం అంత చాలా చక్కగా నాకు వారి సహాయ సహకారాలు అందించారు. వారి సహాయ సహకారాలతో మీ అందరి ఆశీర్వాదంతో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయాను. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, అమెరికా రాష్ట్రంలో కూడా విడుదల చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది అని,తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. తర్వాత దర్శకుడు ఆకుల రాఘవ మాట్లాడుతూ మేము ఎంతో కష్టపడి డిసెంబర్ నెలలో సినిమాను స్టార్ట్ చేశాను. అక్కడ మంచు విపరీతమైన చలి అయినా, తట్టుకొని సినిమాలో చేశాను. మాకు నటులతో పాటు టెక్ని టెక్నీషియన్స్ కూడా ఎంతో సహకారం అందించారు. వారిసహాయ సహకారంతోనే ఈ సినిమాను పూర్తి చేశాను. అని ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. అలాగే కెమెరా ముందుకు రాని నటులు, కెమెరాకు ముఖం తెలియని వారు కూడా మా సినిమాలో చాలా చక్కగా నటించారు. వారు కూడా చాలా చక్కగా చేశారు. ఇక చాలామంది అన్నా నువ్వు చేస్తున్నావు చాలు. మాకు డబ్బు అవసరం లేదు. అని అందరూ వారి సహాయ సహకారం అందించి చక్కగా నటించారు. అని తెలియపరిచారు. అలాగే టెక్నీషియన్స్ అందరు, కూడా పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా చక్కగా చేసి ఇచ్చారని వారికి కూడా దర్శకుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా చక్కగా వచ్చినసందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెబుతూ… ముగించారు. జైహింద్
ఈ చిత్రంలో హిరో కిషోర్ తేజ,హీరోయిన్ అంకిత మూలేర్,కొత్త పాత నటి నటులు నటించగా,సంగీతం : జె. భానుప్రసాద్,లిరిక్స్:ఆకుల రాఘవ,D.O.P : కిరణ్ &కిట్టు,ఫైట్స్:అభిబాయ్,ఎడిటింగ్:బురెన్ బెగ్, కథ,మాటలు,నిర్మాత:తుమ్మల.సత్యనారాయణ,స్క్రీన్ ప్లే దర్శకత్వం:ఆకుల రాఘవ.