శ్రీ శివాయ్ ఫిలింస్ బ్యానర్ లో ” ప్రొడక్షన్ నెం 1 ” ప్రారంభం

799

గౌతమ్ వ్యాస్ ,మిస్ తెలంగాణ దీపికా వధాని లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీ శివాయ్ ఫిలింస్ బ్యానర్ పై స్రవంతి మురళీ మోహన్ తెరకెక్కిస్తున్న ప్రొడక్షన్ నెం 1 చిత్రం హైద్రాబాద్ లో ప్రారంభమైంది . కె. రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీమంతుడు ,ఖైదీ చిత్రాల ఫేం హరీష్ ఉత్తమన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. అర్ధనారీ చిత్రం హీరో అర్జున్ విలన్ గా నటిస్తున్నారు . పూజ కార్యక్రమాల అనంతరం ..

చిత్ర దర్శకుడు స్రవంతి మురళీ మోహన్ మాట్లాడుతూ: గౌతమ్ వ్యాస్ ,మిస్ తెలంగాణ దీపికా వధాని లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న ఈ చిత్రాన్ని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్ లో రూపొందిస్తున్నామని తెలిపారు . సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైద్రాబాద్ లో ,సెకండ్ షెడ్యూల్ గోవాలో ,థర్డ్ షెడ్యూల్ కేరళలో చేయనున్నట్లు తెలిపారు . నలభై రోజుల్లో సినిమా పూర్తి చేస్తామని అన్నారు .

చిత్ర నిర్మాత కె .రమేష్ బాబు మాట్లాడుతూ : దర్శకులు స్రవంతి మురళీ మోహన్ చెప్పిన కథ బాగా నచ్చింది . ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ గా నిర్మిస్తామని తెలిపారు

సాంకేతిక వర్గం : హీరో హీరోయిన్లు : గౌతమ్ వ్యాస్ ,మిస్ తెలంగాణ దీపికా వధాని, కెమెరా : జి ఎస్ .రాజ్ (మురళి ) ,మ్యూజిక్ :శివ నందిగామ , పి .ఆర్ .ఓ : శ్రీధర్ , చీఫ్ అసోసియేట్ :అనిల్ పురేటి , నిర్మాత : కె . రమేష్ బాబు , కథ ,స్క్రీన్ ప్లే – గౌతమ్ vyas దర్శకత్వం : స్రవంతి మురళీ మోహన్