`స‌మ‌రం` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన రాజ్ కందుకూరి

541


సాగ‌ర్ గంధం, ప్ర‌గ్యా న‌య‌న్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `స‌మ‌రం`. యూనివ‌ర్స‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై బ‌షీర్ ఆలూరి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస్ వీరంశెట్టి, జీవీఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌స్తుతం సెన్సార్‌కి సిద్ధ‌మైంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులను మెప్పించేలా సినిమా ఉంటుంద‌ని, డిసెంబ‌ర్ నెల‌లో సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం, త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.

న‌టీన‌టులు:
సాగ‌ర్ గంధం, ప్ర‌గ్యా న‌య‌న్, సుమ‌న్‌, వినోద్ కుమార్‌, స‌త్య‌ప్రకాష్‌, జ‌హీదా, ప్రియాన్షు, స‌హ‌నా, వేణుగోపాల్ త‌దిత‌రులు

సాంకేతిక‌వ‌ర్గం:
బ్యాన‌ర్‌: యూనివ‌ర్స‌ల్ ఫిలింస్
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: బ‌షీర్ ఆలూరి
నిర్మాత‌లు: శ్రీనివాస్ వీరంశెట్టి, జీవీఎస్‌
స‌హ నిర్మాత‌: ప్ర‌గ్యా న‌య‌న్‌
కెమెరా: నాగ‌బాబు క‌ర్ర‌
మ్యూజిక్‌: రాజ్ కిర‌ణ్‌
ఆర్ట్‌: సురేశ్ భాను
ప్రొడ‌క్ష‌న్‌: హ‌రి
పాట‌లు: రామారావు
ఫైట్స్‌: అవినాష్‌