*రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న “మల్లె తీగ” చిత్రం ప్రారంభం*

358

శ్రీ నందనం క్రియేషన్స్ పతాకంపై జైరాజ్ జల్లూరి,ప్రవీణ్ పోతురాజు, సిమ్రాన్, హన్సిక శ్రీనివాస్, సుజాత, భరత్, చందు ప్రధాన పాత్రల్లో… పల్లి మోహన్ రావు దర్శకత్వంలో శ్రీను మోచర్ల నిర్మిస్తున్న చిత్రం “మల్లెతీగ”. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. దర్శకుడు సముద్ర హీరో హీరోయిన్ల పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు నిర్మాత డి.యస్. రావు మల్లెతీగ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సంధర్భంగా…

*నటుడు, నిర్మాత డి.యస్.రావు మాట్లాడుతూ* .. అంతా కొత్త వాళ్లతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న ఈ “మల్లెతీగ” సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

* దర్శకుడు సముద్ర మాట్లాడుతూ* .. .ఈ చిత్ర మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ఈ మల్లె తీగ చిత్రం ఎర్ర మల్లెలు అంత పెద్ద హిట్ అవ్వాలి. మంచి కథను సెలెక్ట్ చేసుకొని చేస్తున్న దర్శక, నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

*చిత్ర నిర్మాత శ్రీను మోచర్ల మాట్లాడుతూ* దర్శకుడు చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించింది. ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక విలేజ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. కొత్తవారితో చేస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు.

*చిత్ర దర్శకుడు పల్లి మోహన్ రావు మాట్లాడుతూ* ఇది నా మొదటి చిత్రం రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథే హీరో. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు కేవలం కథకు ప్రాణం పోస్తారు. వైజాగ్ దగ్గర గుడివాడ పరిసర ప్రాంతంలో ఉన్న ఈ విలేజ్ ఎక్కడా మ్యాప్ లో కూడా లేదు గవర్నమెంట్ అండర్ లో లేని ఈ విలేజ్ కు సెట్ కూడా అవసరం లేదు. ఇది పూర్తి ట్రైబల్ లో ఉన్న ఈ విలేజ్ ను సెలెక్ట్ చేసుకొని షూట్ షూటింగ్ చేస్తున్నాం.ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాము.ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాత శ్రీను మోచర్ల గారికి కృతజ్ఞతలు అన్నారు.

*హీరో ప్రవీణ్ పోతురాజు మాట్లాడుతూ..* నేను చేసిన జనసేన తర్వాత చేస్తున్న సినిమా ఇది. దర్శకుడు పల్లి మోహన్ రావు గారు చెప్పిన లైన్ చాలా రగడ్ గా అనిపించింది. ఈ కథ నాకు కరెక్ట్ అనిపించి సినిమా చేస్తున్నాను. యూత్ అంతా కలిసి చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు

*హీరో జై రాజ్ జల్లూరి మాట్లాడుతూ* .. కొత్త వారిమైన మా లాంటి వారికి ఎంకరేజ్ చేస్తూ మంచి కాన్సెప్ట్ ఉన్న ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక ,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

*హీరోయిన్స్ మాట్లాడుతూ* ..కథ చాలా బాగుంది ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు

*నటీనటులు*
జైరాజ్ అల్లూరి,ప్రవీణ్ పోతురాజు, సిమ్రాన్, హన్సిక శ్రీనివాస్ ,సుజాత, భరత్, చందు తదితరులు

*సాంకేతిక నిపుణులు*
బ్యానర్ : శ్రీ నందనం క్రియేషన్స్
ప్రొడ్యూసర్ : శ్రీను మోచర్ల
దర్శకత్వం : పల్లి మోహన్ రావు
కెమెరా : దేవేంద్ర సూరి పరవస్తు
ఎడిటర్ : సోమేశ్ ముత్త
మ్యూజిక్ : నాగేష్ గౌరీస్
ప్రొడక్షన్ కంట్రోలర్ : రాజేష్ సిరసుపల్లి