తొలి ఏకాదశిని పురస్కరించుకొని “వాడెవ్వడు వీడెవ్వడు మన ప్రేమకు అడ్డెవ్వడు”? ట్రైలర్ లాంచ్

321

మాస్టర్ బాలు, మాస్టర్ మహేష్ సమర్పణలో బి .యం క్రియేషన్స్ పతాకంపై పోసాని కృష్ణ మురళి నటీనటులుగా పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో నిర్మాత పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం “వాడెవ్వడు వీడెవ్వడు మన ప్రేమకు అడ్డెవ్వడు”?. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా

నటుడు చిత్ర దర్శకులు పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. నటుడుగా 400 సినిమాలలో నటించాను, అలాగే రైటర్ గా 100 సినిమాలు రాసింటాను. అలాగే కొన్ని సినిమాలకు డైరెక్షన్ కూడా చేశాను.అయితే దుర్గారావు తీసే సినిమాలో నాకొక క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాకు నేను 12 రోజులు పని చేశాను. ఇన్ని సినిమాలు చేసిన నాకు చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ దగ్గరైన వ్యక్తి పప్పుల కనక దుర్గారావు. దుర్గారావు గారు నాతో నీ పై నాకు చాలా నమ్మకం ఉంది. నీతో సంవత్సరానికి రెండు సినిమాలు చెయ్యాలకుంటున్నాను మీరే కథలను రెడీ చేసుకొండి అని చెప్పడం జరిగింది. అయితే నా కొడుకు ఉజ్వల్ పోసాని కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసుకున్న ఈ కథను నిర్మాత దుర్గరావు వినిపించడంతో తనకీ కథ నచ్చడంతో నన్నే డైరెక్షన్ చేయమన్నాడు.మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాను విజయవాడ, కృష్ణ బ్యాక్ డ్రాప్ లో చిత్రికరించడం జరిగింది. నిర్మాత దుర్గా రావు గారు నాపై ఉన్న నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.కాలం ఉన్నంత కాలం కాకపోయినా బ్రతికున్నంత కాలం మనిద్దరం స్నేహితులుగా ఉంటాం.ఈ సినిమాలో అందరూ కొత్త ఆర్టిస్టులే. సినిమాలో ముగ్గురు అమ్మాయిలు శ్వేత, స్నేహ, శృతి నటించారు. వారు ముగ్గురు ఇందులో హీరోయిన్ లే.అలాగే విలన్ గా హీరోగా డిఫ్రెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అశోక్ చాలా చక్కగా నటించాడు. ఈ సినిమాకు పనిచేసిన నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ కూడా కొత్తవారైనా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు.చాలా షాట్ టైమ్ లో అంటే 30 రోజుల్లో ఈ సినిమాను షూట్ చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అన్నారు

చిత్ర నిర్మాత పప్పుల కనక దుర్గారావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రానటువంటి కొత్త కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని దర్శకుడు పోసాని కృష్ణ మురళి గారు చాలా చక్కగా తెరకెక్కించాడు.ఈ సినిమాకు పనిచేసిన వారందరూ కొత్తవరైనా మాకు బాగా సపోర్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము.మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటుడు అశోక్ మాట్లాడుతూ.. లెక్చరర్ గా చేస్తున్న నేను నటుడు అవుతాను అనుకోలేదు.పోసాని సర్ నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చారు. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటి స్నేహ మాట్లాడుతూ…పోసాని సార్ తో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తాను. నేను ఇండస్ట్రీ కి కొత్త అయినా పోసాని సర్ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు నాతో చక్కని నటనను రాబట్టుకున్నారు. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటి శ్వేత మాట్లాడుతూ..పోసాని సార్ తో ఇంతకుముందు రెండు,మూడు సినిమాలలో నటించాను. తను చాలా కూల్ పర్సన్. తను డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాలో కూడా నాకు నటించే అవకాశం ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు అన్నారు.

నటి శృతి మాట్లాడుతూ. ఈ మూవీ నాకు వెరీ స్పెషల్. ఇందులో నేను చేసిన ఇలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం రావడం చాలా అరుదు.అంత మంచి క్యారెక్టర్ చేశాను. నాకిచ్చిన ఈ అవకాశంతో నేను బాగా నటించాను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రంలో
నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు.ఈ సినిమా సీన్స్ ఏ సినిమాకు అటాచ్ కాదు. స్క్రిప్ట్ లేకుండా మూవీ ని షూట్ చేయడం జరిగింది.కొత్త లొకేషన్స్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మేము కొత్త వారైనా ఇలాంటి మంచి చిత్రానికి వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు

నటీనటులు
పోసాని కృష్ణ మురళి, అశోక్, శ్వేత, స్నేహ, శృతి, సుధాకర్, శ్రీ కుమార్, విష్ణు తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : మాస్టర్ బాలు, మాస్టర్ మహేష్
బ్యానర్ : బి .యం క్రియేషన్స్
నిర్మాత : పప్పుల కనక దుర్గారావు
దర్శకత్వం : పోసాని కృష్ణ మురళి
కథ, స్క్రీన్, ప్లే : పోసాని ఉజ్వల్
సినిమాటోగ్రఫి : సుధాకర్ అక్కెనపల్లి
ఎడిటర్ : బాలరాజు భుక్య
అసిస్టెంట్ డైరెక్టర్ :సూర్య
డి. ఐ : శ్రీ కుమార్ ,
మిక్సింగ్ : విష్ణు వర్ధన్ కాగిత
పి ఆర్. ఓ : నాగేశ్వరావు