‘ఒరేయ్‌ బుజ్జిగా…` – చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ .

826

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఉగాది కానుకగా మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – “ఒరేయ్ బుజ్జిగా` ఒక కంప్లీట్ ఎంటర్ టైనర్. టీమ్ అందరూ ఎంతో ఫ్యాషన్ తో సినిమాని ముందుకు తీసుకెళ్లారు. థియేటర్ లో సినిమా చూసి రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. మార్చి 25న సినిమా విడుదలవుతుంది. ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వస్తాయి. ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీ గా నవ్వుకుని వెళ్లే సినిమా. ప్రతి ఒక్కరూ థియేటర్ లోనే సినిమా చూడండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్ గారికి, దర్శకుడు విజయ్ కుమార్ గారికి ధ‌న్యవాదాలు” అన్నారు.

దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ – “మా నిర్మాత రాధా మోహన్ గారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. చాలా మంచి నిర్మాత. కథకు ఏమి కావాలో అన్ని ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. సినిమాలో హ్యుజ్ ప్యాడింగ్‌ ఉంది. అందరు చక్కగా నటించారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి తగిన సినిమా. మాళవిక నాయర్ న్యాచురల్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరు ఇది నా సినిమా అని ఓన్ చేసుకొని అద్భుతంగా పెర్ఫామ్ చేశారు.   అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఉగాదికి మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహన్ మాట్లాడుతూ – “ఒరేయ్ బుజ్జిగా` నేను, విజయ్ కుమార్ స్టార్ బక్స్ లో కాఫీ తాగుతున్నప్పుడు ఈ స్టోరీ నేరేట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయిన సినిమా ఈ ఉగాదికి పచ్చడిలా వస్తుంది. మా ఒరేయ్ బుజ్జిగా టైటిల్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికే విడుదలైన `కురిసెన, కురిసెన` పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కి, ఫ్యామిలీస్ కి నచ్చే అన్ని రకాల కమ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా.   అన్నారు.

సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ మాట్లాడుతూ – “విజయ్ కుమార్ గారితో ఇది నా మూడవ సినిమా. ఈ సినిమాకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు’ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.