లాంఛనంగా ప్రారంభమైన `ఒకడు`

535

అఖిల్ రెడ్డి హీరోగా అరుణ- కల్యాణి టాకీస్ బ్యానర్ పై కృష్ణ చైతన్య దర్శకత్వంలో ముత్తయ్య, సోమరాజు కల్యాణి నిర్మాతలుగా `ఒకడు` అనే కొత్త చిత్రం శనివారం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి శేఖర్ మాస్టర్ క్లాప్ ఇవ్వగా.. సత్య మాస్టర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్ట్‌ను బి.వి.ఎస్.రవి అందించారు. ఈ సందర్బంగా…
దర్శకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ “ఇది నా మొదటి చిత్రం. మంచి అనుభవమున్న టీమ్‌తో కలిసి పనిచేస్తున్నాను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్‌తో థ్రిల్లర్ సబ్జెక్ట్‌గా రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 15 లేదా 16 తేదీ నుంచి మొదలవుతుంది. 5 షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీ, కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగనుంది“ అన్నారు.

నిర్మాత ముత్తయ్య మాట్లాడుతూ “కొత్త కథనంతో అతి త్వరలో మీ ముందుకు వస్తున్నాం. ఈ `ఒకడు` సినిమాను ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను“ అని అన్నారు.

అఖిల్ రెడ్డి, దీపికా వడ్డాని, దీపాలి శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి నిర్మాతలు: సండ ముత్తయ్య, సోమరాజు కల్యాణి, లైన్ ప్రొడ్యూసర్: వి.పద్మనాభం, మ్యూజిక్:మణిశర్మ, డిఓపి: ఎస్. మురళి మోహన్ రెడ్డి, డైలాగ్స్: పవన్ అత్సాల, లిరిక్స్: శ్రీమణి, ఎడిటర్:ఎస్ ఆర్. శేఖర్, స్టంట్స్: సుబ్బు, ఆర్ట్: పి ఎస్. వర్మ, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బు, కో డైరెక్టర్స్: జె.వి. కృష్ణ రెడ్డి, శరత్ కుమార్. స్టోరీ- స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కృష్ణ చైతన్య.