*అల్లు శిరీష్ చేతుల మీదుగా “ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి” సినిమా ట్రైలర్ లాంఛ్*

503

క‌ల‌ర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ లో రూపొందిన చిత్రం “ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి”. కార్తిక్ బిమల్ రెబ్బ, సంచిత పొనాచ జంట‌గా న‌టించారు. జ‌యంత్ గాలి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమ, పెళ్లి ఏ బంధమైనా తమ జీవితానికి బంధనం కాకూడదు, స్వేచ్ఛను అడ్డుకోకూడదు అనుకుంటున్నారు నేటి యువత. నో కమిట్ మెంట్స్, నో బుల్ షిట్స్, లెట్స్ కీపిట్ సింపుల్ అనేది వాళ్ల మాట. ప్రేమ కాదు, ఫ్రెండ్ షిప్ కాదు దాన్ని మించింది అంటూ ఈ బంధాలకు కొత్త పేర్లు పెడుతున్నారు యువత. ఇలాంటి యూత్ ఫుల్ అంశాలన్నీ చిత్రంలో ఉండబోతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి” సినిమా ఈ నెల 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం “ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి” సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను యంగ్ స్టార్ అల్లు శిరీష్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ….లవ్ లైఫ్ అండ్ పకోడి సినిమా మార్చి 12 రిలీజ్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. పనిచేసిన వాళ్లకు సినిమా డిఫరెంట్ గానే ఉంటుందని అనిపిస్తుంటుంది. ఇలాంటి లవ్ స్టోరీ సినిమా తెలుగులో చూడలేదని నేను గర్వంగా చెప్పగలను. హీరో హీరోయన్లు ఉంటారు. వాళ్ల మధ్య డిఫరెన్సెస్ వస్తాయి. మళ్లీ చివరలో కలుస్తారు. ఇదే సహజంగా మన సినిమాల్లో ఉంటుంది. కానీ మా చిత్రంలో హీరో హీరోయిన్లు కలవడం విడిపోవడం చివరకు కలవడం పూర్తిగా కొత్తగా ఉంటుంది. అన్నారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ….థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఆడియెన్స్ ఈ లెవెల్లో థియేటర్స్ కు వచ్చి సినిమాలను ఎంకరేజ్ చేస్తారని అనుకోలేదు. మీరు ధైర్యంగా బయటకొచ్చి సినిమాలు చూడటం వల్లే మేము సంతోషంగా ఉండగలిగాం. నా ఆర్టికల్ చదివి దర్శకుడు సినిమా చేశారు అని చెప్పాక సంతోషంగా ఉంది. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో శ్రీధర్ గారు ముందుంటారు. ఒక మనసు, దొరసాని, ఏబీసీడీ చిత్రాలతో కొత్త దర్శకులను తీసుకొచ్చారు. వెంకీ అట్లూరి, అడవి శేష్, సందీప్ కిషన్ లాంటి హీరోలను టాలీవుడ్ లో పరిచయం చేసింది శ్రీధర్ గారే. శ్రీధర్ గారంటే నాకు ఎందుకు ఇష్టం  నా కొత్త సినిమా వివరాలు త్వరలో చెబుతాను. అన్నారు.

మధురా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్నెళ్ల క్రితమే శిరీష్ గారి టైమ్ తీసుకున్నాను. ట్రైలర్ నచ్చితేనే రిలీజ్ చేయండి అని అడిగాను. ఆయన రావడం సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ తప్పు చేయలేదు. మెంటల్ మదిలో, మల్లీ రావా, పెళ్లి చూపులు వంటి చిత్రాల్లో నేను డిస్ట్రిబ్యూషన్ లో ఇన్ వాల్వ్ అయ్యాను. ఆ సినిమా విషయంలో నా జడ్జిమెంట్ తప్పు కాలేదు. గతంలో బాలచందర్ గారు హ్యూమన్ ఎమోషన్స్ ను ఎలా చూపించారో మా చిత్ర దర్శకుడు అలా చూపించారు. ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఓన్లీ మల్టీఫ్లెక్స్ లో లవ్ లైఫ్ అండ్ పకోడి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. 70 మల్టీ ఫ్లెక్స్ లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.   మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

హీరో కార్తిక్ బిమల్ రెబ్బ మాట్లాడుతూ…మీడియా, ఫ్రెండ్స్ అందరికీ థాంక్స్. ఈ స్పెషల్ జర్నీ గురించి మాట్లాడాలి. ఈ కాన్సెప్ట్ రిలేషన్ షిప్స్ గురించి చెబుతుంది. జయంత్ రెండు నుంచి మూడేళ్ల టైమ్ తీసుకుని కథ రాశారు. ఈ కథ నాకు చెప్పినప్పుడు చాలా ప్లెజంట్ గా అనిపించింది. లవ్ లోని సంబంధాలను చాలా బాగా చెప్పారు. అలాంటి పాత్రలు, సన్నివేశాలు కథలోకి తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ ను ప్రమోట్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చినందుకు వెంకట్, శ్రీధర్ గారికి థ్యాంక్స్. మీ స్పందన కోసం చూస్తున్నాం.అన్నారు.

హీరోయిన్ సంచిత పొనాచ మాట్లాడుతూ…వెంకట్ , శ్రీధర్ సార్ వల్లే మా సినిమా ఇక్కడిదాకా వచ్చింది. ఇది న్యూ ఏజ్ స్టోరీ. మోడరన్ రిలేషన్ స్టోరీ అని చెప్పను కాను. లవ్ , రిలేషన్ ను డీప్ గా చూపిస్తుంది. మీరు మా చిత్రాన్ని బాగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. థియేటర్లో కలుద్దాం. అన్నారు.

దర్శకుడు జయంత్ గాలి మాట్లాడుతూ...మా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన శిరీష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా బడ్జెట్ చిన్నది కానీ నిజాయితీగా ఉంటుంది. మరే పెద్ద సినిమాకూ తీసిపోదు. అంత కష్టపడి జెన్యూన్ గా చేశాం. నేను గతంలో యఎస్ లో జాబ్ చేశాను. ప్రతి ఇంట్లో సినిమా పిచ్చోళ్లు ఉంటారు. మా ఇంట్లో నాకు సినిమాలంటే ఇష్టం. నేను ఇవాళ ఇక్కడ ఉండేందుకు చాలా మంది స్ఫూర్తి నిచ్చారు. తెలుగు స్టార్స్ సినిమాలు ఎవరివి రిలీజ్ అయినా ఫస్ట్ డేనే చూసేవాడిని. మాది అనంతపురం, నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఫాంటసీ. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ పై ఇష్టం పెరిగి, నేనూ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అల్లు శిరీష్ గారి ఒక ఆర్టికల్ చదివిన తర్వాత సినిమాల్లోకి రావాలని డెసిషన్ తీసుకున్నాను. యూఎస్ నుంచి కెమెరా పట్టుకుని హైదరాబాద్ వచ్చాను. మీ మనసును సినిమా తాకుతుందని నమ్ముతున్నాను. అన్నారు.

ఆక‌ర్ష్ రాజ్ భాగ‌వ‌తుల‌, క్రిష్ణ హాబ్బ‌ల్ , క‌ళా జ్యోతి , అనురాధ మ‌ల్లికార్జున ఇతర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – సాగ‌ర్ వైవివి జ‌తిన్ మోహాన్, సంగీతం – ప‌వ‌న్, ఎడిట‌ర్ – శ్ర‌వణ్ క‌టికనేని, ఆర్ట్ – దండు రెంజీవ్, పి ఆర్ ఓ – జియ‌స్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ -వెంక‌ట సిద్దారెడ్డి, స‌మ‌ర్ప‌ణ – మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, నిర్మాత‌, ర‌చ‌న‌ , ద‌ర్శ‌క‌త్వం – జ‌యంత్ గాలి.

PRO ;GSK MEDIA