చావు కబురు చల్లగా సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు – లావణ్య త్రిపాఠి !!!

451

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా.. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. జీఏ2 పతాకంపై బన్నీ వాస్‌ నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ నెల 19న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ…

ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. గీతా ఆర్ట్స్ లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థాంక్స్ టు బన్నీ వాసు గారు. ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి, అందరూ కనెక్ట్ అవుతారు.

గీతా ఆర్ట్స్‌తో ఇది నాకు మూడో సినిమా. ఈ సినిమా ఎంతపెద్ద హిట్ అవుతుంది అనేది పక్కనబెడితే కథ ప్రకారం ఈ సినిమా నాకు నచ్చింది. దానికి కౌశిక్, వాసు, అరవింద్ గారికి థ్యాంక్స్. కౌశిక్ ఈ కథ చెప్పినపుడు సగంలోనే ఓకే చెప్పాను. ఇలాంటి కథ చెప్పినందుకు థ్యాంక్స్. కార్తికేయ మంచి కో ఆర్టిస్ట్. ఈ సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్.

కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నందుకు వాసు గారికి అరవింద్ గారికి మరోసారి థ్యాంక్స్. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా నా సొంత వాయిస్ తో డబ్బింగ్ చెవుతాను.

కార్తికేయ ఎంత ఇంటెక్షన్ తో కథ రాసాడో అంతే ఇంటెక్షన్ తో కార్తికేయ ఈ సినిమాలో నటించాడు. ఒక మంచి సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సరికొత్త స్క్రీన్ ప్లే అందరిని అలరిస్తుంది. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. తెలుగులో ఒక థ్రిల్లర్ సినిమా సైన్ చేశాను, తమిళ్ లో ఒక సినిమా చేస్తున్నాను, పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు.