అట్టహాసంగా సినీ గోయర్స్ స్వర్ణోత్సవ సినిమా అవార్డుల వేడుకలు

311

పురస్కారాలు బాధ్యతను పెంచే ప్రోత్సాహకాలు – గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్

అట్టహాసంగా సినీ గోయర్స్ స్వర్ణోత్సవ సినిమా అవార్డుల వేడుకలు

సినీగోయర్స్ జీవన సాఫల్య పురస్కారం స్వీకరించిన రాజేంద్రప్రసాద్

సినీ గోయర్స్ ఐదు దశాబ్దాల పురస్కారాలు అందుకున్న జయప్రద, ప్రకాష్ రాజ్

సినిమా రంగం మాత్రమే కాదు, ఏ రంగం లో అయినా పురస్కారాలు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తాయని, బాధ్యతను మరింత పెంపొందిస్తాయని, అన్ని విధాలుగా రాణించేందుకు దోహదపడతాయని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. ప్రతిష్టాత్మక సినీ గోయర్స్ 52వ స్వర్ణోత్సవ ఫిలిం అవార్డుల వేడుకలు శుక్రవారం శిల్పకళా వేదిక లో అట్టహాసంగా జరిగాయి.

ముఖ్యఅతిధిగా విచ్చేసిన గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ సమాజం లో అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన వినోద మాధ్యమం సినిమా అని, బాధ్యతాయుత సినిమాలు నిర్మించాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో టాలీవుడ్ సినిమా కు ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షల మంది సినిమా రంగం లో ఉపాధి పొందుతున్నారని అభినందించారు. సమాజం లో నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు సినిమా రంగం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.

డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 52 ఏళ్లుగా హైదరాబాద్ లో అవార్డులు ఇస్తూ సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తున్న సినీ గోయర్స్ ఎంతో ప్రతిష్టాత్మక సంస్థ అని, తాను కూడా పలు మార్లు ఈ పురస్కారాన్ని స్వీకరించి గర్వంగా అనుభూతి చెందినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, హీరో నాని, సునీల్ తదితరులు పాల్గొని పురస్కారాలు అందించి అభినందించారు. సినీ గోయర్స్ అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు డాక్టర్ పి.శ్రీధర్, బి.రామకృష్ణ పర్యవేక్షించారు. 2019, 2020 సంవత్సరాలకు సంబంధించి పురస్కారాలు ప్రదానం చేశారు.
ఫైవ్ డికేడ్స్ సినీ గోయర్స్ పురస్కారాలను జయప్రద, ప్రకాష్ రాజ్ స్వీకరించారు. సినీ గోయర్స్ జీవన సాఫల్య పురస్కారాలను డాక్టర్ రాజేంద్రప్రసాద్ అందుకున్నారు.

1919 పురస్కార గ్రహీతలు

ఉత్తమ హీరో హీరోయిన్లు గా చిరంజీవి (సై రా నరసింహారెడ్డి), తమన్నా (ఎఫ్ 2) అవార్డులు స్వీకరించారు. ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి (మహర్షి), ఉత్తమ సంచలన హీరో హీరోయిన్లు గా నాని (జెర్సీ), మెహ్రీన్ (ఎఫ్ 2), ఉత్తమ సంచలన దర్శకుడిగా సురేందర్ రెడ్డి (సై రా నరసింహా రెడ్డి), ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్లుగా రావు రమేష్ (ప్రతి రోజు పండుగే), డాక్టర్ రాజేంద్రప్రసాద్ (ఓహ్ బేబీ), ఆశ్రీత (యాత్ర), ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి), ఉత్తమ విలన్ గా కబీర్ దుహన్ సింగ్ (యాక్షన్), ఉత్తమ గాయని గాయకులుగా మంగ్లీ (జార్జి రెడ్డి), రాహుల్ సిప్లిగంజ్ (మహర్షి), ఉత్తమ గేయ రచయిత గా సిరివెన్నెల సీతా రామశాస్త్రి (సై రా), ఉత్తమ సంభాషణల రచయిత గా బుర్రా సాయి మాధవ్ ( సై రా), ఉత్తమ చిత్రం గా జెర్సీ ఎంపికై పురస్కారాలు స్వీకరించారు. ప్రత్యేక జ్యూరీ పురస్కారాలను నిత్యా శెట్టి (ఓ పిట్టకథ ), సత్యదేవ్ (బ్రోచే వారెవరురా ), అనిల్ రావిపూడి (ఎఫ్ 2), దిల్ రాజు (సరిలేరు నీకెవ్వరూ) గెలుచుకున్నారు.

2020 పురస్కార గ్రహీతలు

ఉత్తమ హీరో హీరోయిన్లుగా అల్లు అర్జున్ (ఆల వైకుంఠ పురం లో), రష్మిక మంథాన (సరిలేరు నీకెవ్వరు), ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (సరిలేరు నీకెవ్వరు), ఉత్తమ సంచలన హీరో హీరోయిన్లుగా సుధీర్ బాబు (వి), పాయల్ రాజపుత్ (డిస్కో రాజా) ఉత్తమ చిత్రం గా ఆల వైకుంఠ పురం లో), ఉత్తమ సంచలన దర్శకుడిగా వెంకీ కొడుముల (భీష్మ) ఎంపికై అవార్డులు అందుకున్నారు. ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్లుగా మురళీ శర్మ (అల వైకుంఠ పురం లో), విజయ శాంతి (సరిలేరు నీకెవ్వరు), ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ తమన్ (అల వైకుంఠ పురం లో), ఉత్తమ విలన్ గా సునీల్ (కలర్ ఫోటో), ఉత్తమ హాస్య నటులుగా వెన్నెల కిషోర్ (భీష్మ), ఉత్తమ గేయ రచయిత గా రామ జోగయ్య శాస్త్రి (అల వైకుంఠ పురం లో), ఉత్తమ గాయనీ గాయకులుగా మధు ప్రియ (సరిలేరు నీకెవ్వరు), అర్మాన్ మాలిక్ (అల వైకుంఠ పురం లో), ఉత్తమ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ (అల వైకుంఠ పురం లో) పురస్కారాలు కైవసం చేసుకున్నారు.