క‌ల‌ర్ ఫుల్ గా జ‌రిగిన‌ క‌ల‌ర్ ఫొటో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

697


అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం క‌ల‌ర్ ఫొటో. ఈ సినిమాతో సందీప్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సుహాస్, చాందీని చౌద‌రి జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టుడు సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైవా హ‌ర్ష మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ ద్వారా హృద‌య‌కాలేయం, కొబ్బ‌రి మ‌ట్ట వంటి సూప‌ర్ హిట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్స్ ని అందించిన నిర్మాత సాయి రాజేశ్, ఇప్పుడు క‌ల‌ర్ ఫొటో చిత్రానికి క‌థ కూడా అందించ‌డం విశేషం. ప్ర‌ముఖ తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా యాప్ ద్వారా ఈ సినిమా అక్టోబ‌ర్ 23న విడుద‌ల అవుతుంది. ఈ నేఫ‌థ్యంలో నిన్న జ‌రిగిన క‌ల‌ర్ ఫొటో క‌ల‌ర్ ఫుల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చిత్ర బృందంతో పాటు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మకు ప్ర‌ముఖ యువ ద‌ర్శ‌కులు హాజ‌రైయ్యారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి, నిర్మాత ఎస్ కే ఎన్, శివ నిర్వాణ‌, హ‌ను రాఘ‌వ‌పూడి త‌దిత‌రులు ఈ ప్రొగ్రామ్ కు అతిధులుగా విచ్చేసి చిత్ర బృందానికి త‌మ శుభాభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ

లాక్ డౌన్ త‌రువాత మ‌ళ్లీ సాధ‌ర‌ణ ప‌రిస్ధితులుకి చిత్ర ప‌రిశ్ర‌మ వ‌స్తుంద‌న‌డానికి ఈ ఫంక్ష‌న్ ఓ చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. నిర్మాత సాయిరాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డ‌మే కాకుండా క‌థ‌ను కూడా అందించ‌డం న‌న్ను బాగా ఆక‌ట్టుకుంది. ఆహా యాప్ ద్వారా అక్టోబ‌ర్ 23న విడుద‌ల కాబోతున్న ఈ సినిమా క‌చ్ఛితంగా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంద‌ని నేను న‌మ్ముతున్నాను అని అన్నారు.