రంగు దర్శకుడు వి. కార్తికేయ ద్వితీయ చిత్రం కృష్ణ లంక ప్రారంభం*

622

రంగు సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ*దర్శకత్వంలో పరుచూరు రవి,నరేష్ మేడి,ఆదర్శ్, రఘు, పెద్దిరాజు, ప్రతీక్ష,అనిత భట్ నటీనటులుగా యారో ఫిక్స్ ఎంటర్టైన్మెంట్ , సొహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిలిమ్స్ లు* *కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న కృష్ణలంక చిత్రం పూజా* *కార్యక్రమాలు హైదరాబాదులోని*
*ఫిలింఛాంబర్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా* *జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన* *ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ నివ్వగా* ,సిటీ *డి.యస్.పి. రాంబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా,నగరం దర్శకుడు ప్రేమ్ రాజ్ గౌరవ దర్శకత్వం వహించాడు.పూజా* *కార్యక్రమాల అనంతరం* …

*పరుచూరి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ…* మామూలుగా పరుచూరి బ్రదర్స్ కు వయసు వచ్చేసింది అంటే గౌరవంగా ఉంటుంది. ముసలోడు అయ్యాడు అంటే తక్కువగా ఉంటుంది. కానీ కర్ర పట్టుకున్న గాంధీ గారే కదా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా దేశానికి మొదటి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. వారందరూ వయసువారే ప్రతి మనిషి 50 నుండి 60 సంవత్సరాల వరకు డబ్బుకు డబ్బు కోసం తపనపడి, డబ్బు సంపాదిస్తాడు. మంచి పేరు తీసుకురావాలని అన్నారు..

* దర్శకుడు ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ..* గతంలో కార్తికేయ తీసిన రంగు చిత్రం లో నన్ను నటించమని బలవంతంగా అందులో ఓ మంచి పాత్ర చేయించాడు. నేను డైరెక్టర్ ని రైటర్ అని అన్నా నువ్వు నా సినిమాలో చేయాలని నాతో చేయించడం జరిగింది.దర్శకుడికి రంగు సినిమా మొదటి సినిమా అయినా స్క్రిప్ట్ బాగా రాసుకుని ఎడిటింగ్ చేయడానికి కూడా వీలులేకుండా తయారు చేసుకొని సినిమా తీయడం జరిగింది.అలాంటి కార్తీక్ కార్తీక్ మళ్లీ ఈ సినిమా తీస్తున్నాడు అంటే దానికి మించి ఇప్పుడు మంచి స్క్రిప్ట్ రాసుకొన్నాడు. రంగు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధించి నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు

*నిర్మాతలు మాట్లాడుతూ** ..కార్తికేయ మాకు రంగు సినిమా నుంచి తెలుసు మేము తీస్తున్న ఈ కృష్ణలంక సినిమా మంచి విజయం సాధించి మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నామని అన్నారు

*దర్శకుడు కార్తికేయ. వి. మాట్లాడుతూ..* రంగు సినిమా నాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది. దాని లాగే ఈ కృష్ణలంక సినిమా కూడా కొత్త రకమైన విజువల్స్ తో, కొత్త రకమైన షాట్స్ తో ,కొత్త రకమైన ఎడిటింగ్ ట్రాన్సక్షన్ తో ,రియలిస్టిక్ అప్రోచ్ ఉంటూనే కరెంట్ అఫైర్స్ ను డీల్ చేస్తూ చాలా ఇంపాక్ట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా చేస్తున్నాము .కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త కొత్తగా చూపించగలమని అని నమ్ముతున్నాను.నాపై నమ్మకం తో
ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

*ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సూర్య మాట్లాడుతూ** ..ఈ కృష్ణ లంక చిత్రాన్ని కార్తికేయ పై నమ్మకంతో బడ్జెట్ లో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాము. జనవరి 22 న షూటింగ్ స్టార్ట్ చేసి 3 షెడ్యూల్స్ లలో సినిమాను కంప్లీట్ చేసి సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

*ప్రొడక్షన్స్*

యారో పిక్స్ ఎంటర్టైన్మెంట్ ,

సోహ్లా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,

చేతన్ రాజ్ ఫిలిమ్స్ .

*నిర్మాతలు* .. కార్తికేయ ,
పూన సోహ్ల,
చేతన్ మై సూరియ

*సాంకేతిక నిపుణులు*

డైరెక్టర్.. కార్తికేయ వి

డైలాగ్స్.. పరుచూరి బ్రదర్స్

సినిమాటోగ్రఫీ.. శ్రీమన్నారాయణ

ఎడిటర్.. కుమార్ తేజ

మ్యూజిక్… కృష్ణ సురమ్ పల్లి

వి.యఫ్.ఎక్స్ ..తేజ్ దిలీప్.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..సూర్య

పి ఆర్ ఓ : జి యస్ కె మీడియా

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ..రమేష్ దిండి

*నటీనటులు*

పరుచూరి రవి ,నరేష్ మేడి, రఘు ఆదర్శ్,పెద్దిరాజు ,ప్రతీక్ష ,అనిత భట్ ,నవదీప్ పటేల్, టార్జాన్, కట్ట శివ ..