రేపే ఉగాది సినీ పురస్కారాలు

532

చరిత్రలో మొట్టమొదటి సారిగా తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ ల కళాకారులకు అవార్డులు ఇవ్వడం అనే ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ నేస్తం ఫౌండేషన్,  తెలుగు సినిమా వేదిక , కూనిరెడ్డి ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో  శుభకృతు నామ సంవత్సర ఉగాది నాడు సాయంత్రం 6 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ లో ఉగాది సినీ పురస్కారాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ బాధ్యులు డైరెక్టర్ బాబ్జీ , కూనిరెడ్డి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు .. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు , ప్రముఖ నిర్మాత , నటుడు , “మా” పూర్వాధ్యక్షులు  మురళీమోహన్ గారు , ప్రముఖ హాస్యనటుడు  బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాత , నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ గారు, నిర్మాత , ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి  దామోదర ప్రసాద్ గారు  , తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ గారు  , చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ గారు  ఇంకా అనేక మంది చిత్ర ప్రముఖులు హాజరు కానున్నారని వారు  తెలిపారు ..  గతంలో సినిమా అవార్డులు అనగానే కేవలం నటీనటులు, దర్శకులు , నిర్మాతలు, ప్రధాన టెక్నీషియన్ లకు మాత్రమే పరిమితమయ్యేవనీ  .. మిగిలిన విభాగాలను పరిగణన లోనికి తీసుకునే వారు కాదనీ .. ఆ సంప్రదాయానికి తెర దించుతూ సినిమా పరిశ్రమకు మూలాధారమైన అన్ని శాఖలను గౌరవించాలనే సదుద్దేశ్యంతో    సినీ దిగ్గజాలు దాసరి , డి .రామానాయుడు, దొరస్వామిరాజు (డి‌డి‌డి) పేర్లతో ”  ఉగాది సినిమా పురస్కారాలు ”  అందివ్వడం జరుగుతుందని..  ఈ సంప్రదాయాన్ని ప్రతి ఏటా ఇలాగే కొనసాగిస్తామని కమిటీ నిర్వాహకులు తెలియజేశారు!!