రాజుబాబు స్మృతి ఎప్పటికీ ఉంటుంది’ దర్శకుడు బి .గోపాల్

81

సినిమా , టీవీ రంగాళ్లలో ప్రసిద్ధుడైన నటుడు బొడ్డు రాజబాబు స్మృతి ఎప్పటికీ ఉంటుందని , ఆయన జయంతి సందర్భంగా స్నేహితులు నిర్వహించిన స్మారక అవార్డుల కార్యక్రమమే ఇందుకు నిదర్శనమని దర్శకుడు బి .గోపాల్ చెప్పారు .
నటుడు రాజబాబు 67వ జయంతి స్మారక అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో గురువారం లో జరిగింది . ఇందులో ముఖ్య అతిధిగా గోపాల్ పాల్గొన్నారు . ఏ వ్యక్తినైనా చనిపోయిన తరువాత గుర్తు పెట్టుకొని స్నేహితులు కార్యక్రమం నిర్వహించడం అపూర్వమైన విషయమని , రాజబాబు స్నేహితులు కె .వి .బ్రహ్మం , నర్రా వెంకటరావు ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాని గోపాల్ తెలిపారు .

నిర్మాతల మండలి అధ్యక్షులు , ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కానూరి దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – గత మూడు సంవత్సరాలుగా రాజబాబు జయంతి ఉత్సవాలకు హాజరవుతున్నాని , ఇది ఎందరికో స్పూర్హిగా నిలవాలని తాను కోరుకుంటున్నాని న, సినిమా , టీవీ , నాటక రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి వారికి రాజబాబు స్మారక అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు .

నటుడు , గాయకుడు , కవి గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ – రాజబాబు తో తనకు ఎంతో అనుబంధం ఉందని , ఆయన మంచి నటుడే కాదు స్నేహశీలి అని చెప్పారు . తన పేరుతో ఏర్పాటైన ట్రస్టు ద్వారా ఇచ్చే అవార్డుల్లో వచ్చే సంవత్సరం నుంచి రాజబాబు పేరుతో ఒక అవార్డును ప్రదానం చేస్తామని చెప్పారు .

దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు మాట్లాడుతూ – సినిమా రంగానికి తానె పరిచయం చేశానని , రాజబాబు జయంతి రోజు ఇలా ప్రతిభావంతులను సత్కరించడం ఎంతో తృప్తిగా ఉందని చెప్పారు .

నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .- ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్ర బాబు నాయుడు అధికారంలోకి వచ్చారని , త్వరలో నంది అవార్డుల ప్రదానం ఉంటుందని , టీవీ అవార్డుల్లో రాజబాబు స్మారక అవార్డును కూడా ప్రవేశ పెట్టడానికి తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు .

రాజబాబు స్మారక అవార్డుల కమిటీ చైర్మన్ కె .వి .బ్రహ్మం మాట్లాడుతూ – రాజబాబుది విలక్షణమైన వ్యక్తిత్వం , అందరినీ ఆత్మీయంగా ప్రేమించే గొప్ప మనిషి, అలాంటి స్నేహితుణ్ని కోల్పోవడం మా అందరికీ బాధ కలిగిస్తుందని , ఆయన ఎప్పటికీ గుర్తుండేలా ఈ అవార్డులకు ప్రదానం చేస్తున్నామని , ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతుందని, ఈ అవార్డుల ఎంపికలో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ సహకరించారని చెప్పారు .

ఈ కార్యక్రమంలో నిర్మాత సి .వి రెడ్డి , దర్శకుడు పి .సాంబశివరావు , నటి అన్నపూర్ణమ్మ , గుమ్మడి గోపాకృష్ణ , పి వి .ఎన్ .కృష్ణ, పత్తి ఓబులయ్య , డాక్టర్ రఘునాథ బాబు , ప్రవీణ్ చంద్ర , గోపి కసిరెడ్డి , వాసు ఇంటూరి , కొర్రపాటి వెంకటేశ్వర రావు , సద్దుల మధుసూదన్ లను రాజబాబు స్మారక అవార్డులతో సత్కరించారు . మల్లికార్జున్ కార్యక్రమాన్ని నిర్వహించారు .