మార్చి 24 న విడుదల అవుతున్న “రాజ్ కహాని”. చిత్రం

210

ఒక మతాంతర ప్రేమకథ ఇతివృత్తంగా రాజ్ కార్తికేన్ హీరోగా నటిస్తూ ,తెరకెక్కిస్తున్న చిత్రం “రాజ్ కహాని”. భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రం మార్చి 24 న ప్రేక్షకుల ముందుకొస్తుంది . ఈ సంధర్భంగా చిత్రయూనిట్ సినిమా రిలీజ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది..

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ.. అమ్మ ప్రేమను అంతర్లీనంగా, అమ్మాయి ప్రేమను బాహ్యవలయంగా చేసుకుని అసలైన ప్రేమకు అర్థం చెప్పే మంచి కథ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాను ప్రేక్షక లోకం తప్పక ఆదరిస్తారని నమ్మకం వ్యక్తపరుస్తున్నాను అన్నారు.

నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికేన్ రాజు గార్లు మాట్లాడుతూ.. మంచి సబ్జెక్టు ఉన్న సినిమా ఇది. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చేసాము.ఈ చిత్రాన్ని మార్చి 24 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యూత్ ని, ఫ్యామిలీని అకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలిపారు.