ఇప్పుడు నిర్మాతలు కథ కంటే కాంబినేషన్‌నే ఎక్కువ నమ్ముకుంటున్నారు: నిర్మాత బెక్కెం వేణుగోపాల్

136


టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెక్కెం వేణుగోపాల్. సత్యభామ, నేను లోకల్, పాగల్, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్తా మామ, హుషారు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు పొందిన బెక్కెం వేణుగోపాల్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. కాగా ఈ నిర్మాత పుట్టినరోజు రేపు (ఏప్రిల్ 27) ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇది.

ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమైనా వుందా?
్టనిర్మాతగా బిజీగా వున్నాను. 2006లో అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలిచిత్రం విడుదలైంది. మొదటి చిత్రం టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రంతోనే తొలిసక్సెస్‌ను అందుకున్నాను. అక్కడి నుంచి 16 సంవత్సరాలు గడిచిపోయింది. సినిమా తప్ప వేరే వ్యాపకం, బిజినెస్ నాకు లేదు. సినిమా తరువాత సినిమా చేస్తూ వచ్చాను.. నిర్మాతగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను.

నిర్మాతగా మీరు సంపాందించింది ఏమిటి?
డబ్బుల గురించి చెప్పను కానీ అంతకంటే విలువైన అనుభవం సంపాందించాను.. నిర్మాతగా ప్రతి సినిమాను ఇష్టంగా నిర్మాంచాను. అదే నాకు గొప్ప అనుభూతి.. నాకు ఎంతో ఇష్టమైన ఫీల్డ్‌లో వున్నాను. సూపర్‌స్టార్ కృష్ణగారి సినిమా షూటింగ్ చూద్దామని వచ్చిన నేను ఈ రోజు నిర్మాతగా ఎదగడం. నాకు ఇష్టమైన సినిమాలో వుండటం ఎంతో ఆనందంగా వుంది.గొప్ప సినిమాలు చేయాలన్న తపన వుంది. ఏది చేయాలన్న కథే కావాలి, ఆ కథల గురించి అన్వేషణ గురించి నిత్యం అన్వేషిస్తుంటాను.

ఇప్పటి వరకు చిన్న సినిమాలే నిర్మించారు? భారీ చిత్రాల నిర్మాణం జరపలేదు ఎందుకని?
బారీ బడ్జెట్ చిత్రాలు చేయకపోవడానికి రీజన్ అంటూ ఏమీ లేదు. ఒక కథ తరువాత ఒకటి చేస్తూ వచ్చాను. కరోనా సమయంలో రెడీ చేసుకున్న రెండు బిగ్ బడ్జెట్ సినిమా కథలు వున్నాయి. వాటి విశేషాలు త్వరలోనే చెబుతాను. అంతే కాకుండా జనాదరణ కథలతో సినిమాలు నిర్మించడమే నాకు ఇష్టం. కథ బాగుంటే ఎన్నో అద్బుతాలు జరగుతాయి.

నిర్మాతగా సంతృప్తిగా వున్నారా?
నన్ను ఆడియన్స్ ఎప్పుడూ మోసం చేయలేదు. నేను ఒకటి రెండు సార్లు వాళ్ల నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. భవిష్యత్‌లో మళ్లీ అలా జరగకుండా చూసుకుంటాను. నిర్మాతగా ఎంతో సంతృప్తిగా వున్నాను.ఆడియన్స్ మన జడ్జిమెంట్‌ను నమ్ముతున్నారు..వాళ్ల నమ్మకాని కాపాడుకోవాలి అనేది మాత్రమై నామైండ్‌లో వుంది.

అల్లూరి విడుదల విషయంలో మీరు ఇబ్బందులు పడ్డారని తెలిసింది?
అల్లూరి సినిమాకు విడుదల సమయంలో జరిగింది కాకుండా వేరే విషయాలు మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికి హీరో శ్రీవిష్ణుతో నాకు మంచి రిలేషన్ వుంది. ఇక ఈ విషయంలో నేను మాట్లాడటం కంటే శ్రీవిష్ణునే మాట్లాడితే బాగుంటుంది. మా ఇద్దరి మధ్య అనుబంధం చాలా బాగా వుంది. అండర్‌స్టాండింగ్‌లో వెళుతుంటాం, సినిమా విడుదల కూడా ఎక్కడా ఆగలేదు. మార్నింగ్ షో కాస్త ఆలస్యంగా విడుదలైంది. అంతే తప్ప అంతకు మించి ఏమీ జరగలేదు. పతి సినిమాకు జరిగే గొడవలే..ఆ సినిమాకు జరిగిన అనుభవాలు నాకు పాఠాలు నేర్పాయి. సినిమా ఇష్టంగా చేశాను. అది గొప్ప సినిమా కాకపోవచ్చు కానీ బ్యాడ్ సినిమా కాదు.

ఓటీటీల ప్రభావంతో చిన్న సినిమాలు కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తున్నారు? ఈ విషయంలో నిర్మాతగా కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
థియేటర్‌లో ఆడే సినిమా మాత్రమే లైఫ్ వుంటుంది. థియేటర్‌లో హిట్ అయితేనే ఓటీటీ వాళ్లు సినిమాలు తీసుకుంటున్నారు. సినిమాల నిర్మాణం పెరిగింది కానీ క్వాలిటీ పెరగలేదు. ఓటీటీ దగ్గర సినిమాలు క్యూలో వుంటున్నాయి. కనీసం ఓటీటీలో టెలికాస్ట్ చెయ్యమని అడుక్కునే పరిస్థితి వుంది. కంటెంట్ బాగుంటేనే సినిమా లు నిర్మిస్తే ఇలాంటి పరిస్థితి రాదు.

దిల్‌రాజుతో మీ జర్నీ కంటిన్యూ చేస్తారా?
తప్పకుండా చేస్తాను.మా జర్నీకి దిష్టి తగలకూడాదని కోరుకుంటున్నాను. ఆయన సపోర్ట్ నాకు ఎప్పుడు వుంటుంది. ఆయన జడ్జిమెంట్‌పై నాకు ఎంతో నమ్మకం వుంటుంది.

విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో సినిమా వుంటుందని అంటున్నారు?
కార్తీక్ దండుతో నాకు బాగా పరిచయం. ఏడు సంవత్సరాల క్రితం ఒక కథ విన్నాను. నాతో సినిమా వుందా లేదా అని ఆయన చెప్పాలి. ఇప్పుడు గొప్ప సక్సెస్‌ను వచ్చింది. ఏంజాయ్ చేస్తున్నాడు. అన్ని కుదరితే తప్పకుండా భవిష్యత్‌లో ఆయనతో సినిమాలు చేస్తాను.

ఈ రోజుల్లో సినిమాల్లో స్టార్ హీరోలు వుంటేనే టిక్కెట్‌లు తెగుతాయి. మీరు మాత్రం ప్రతి సారి కొత్తవాళ్లతో రిస్క్ ఎందుకు చేస్తుంటారు?
కథ, కంటెంట్ బాగుంటే ఎవరితోనే నైనా సినిమాలు ఆడుతాయి, నాకు ఎక్కువ యూత్ జోనర్‌లో సినిమాలు చేస్తుంటాను. అన్ని సినిమాలు కొత్తవాళ్లతోనే చేశాను. సక్సెస్ అయ్యాను.

భవిష్యత్‌లో మీరు నటించడం కానీ దర్శకత్వం కాని చేసే అవకాశం వుందా?
పబ్లిసిటి కోసం ఎన్ని యాక్టింగ్‌లైనా చేస్తాను. తప్ప సినిమాల్లో నటించలేను. నిర్మాతకు మంచిన నటుడు ఎవరు వుండరు. అప్పుడప్పుడు లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్న బయటికి మాత్రం శాంతంగా వుండాల్సిన పరిస్థితి వుంటుంది

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నిర్మాత పరిస్థితి ఎలా వుంది?
నిర్మాతది ఎప్పుడూ క్లిష్ట పరిస్థితే.. సినిమా మీద నాలెడ్జ్ వున్న వాళ్లు, అనుభవం వున్న నిర్మాతలు తీసిన సినిమాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ. అనుభవంతో పాటు సినిమా మీద అంకితభావం వుండాలి. అప్పుడే నిర్మాతగా సక్సెస్ సాధిస్తారు. అయితే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కథ కంటే కాంబినేషన్ నమ్ముకుని ఎక్కువ సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. దాని వల్ల సినిమా సూపర్‌హిట్ అయినా లాభాలు రావడం లేదు. కాంబినేషన్ నమ్ముకుని పారితోషికాలు పెంచేయడం వల్ల సినిమాల బడ్జెట్ కూడా ఊహించని స్థాయికి చేరుకుంటుంది.

నిర్మాతగా మీ లక్ష్యం ఏమిటి?
చనిపోయే వరకు మంచి సినిమాలు తీస్తు వుండాలి.

ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు?
కొత్తవాళ్లతో రోటి, కపడ, రొమాన్స్ అనే సినిమాతో పాటు నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి కలిసి సుడిగాలి సుధీర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. పాగల్ సినిమా దర్శకుడు నరేష్ ఈ సినిమాకు దర్శకుడు. వీటితో పాటు ఓటీటీ కోసం అవికాగోర్ ప్రధాన పాత్రలో స్వరూప్ దర్శకత్వంలో ఓ క్రేజీ థ్రిల్లర్ చేస్తున్నారు. అందరూ సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యే థ్రిల్లర్ ఇది.


Madhu PRO
9849162675