‘ఒకే ఒక జీవితం’ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్

200

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ, అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగు లో అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ విలేఖరుల సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది.

శర్వాంద్ మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం మనసుని హత్తుకునే సినిమా. ఈ సినిమా చుసిన తర్వాత ఇందులో వుండే పాత్రలతో రిలేట్ అవుతాం. కార్తిక్ ఇందులో గొప్ప విషయం చెప్పాడు. నిన్నటి బాధ, రేపటి ఆశ తో బ్రతుకుతుంటాం. కానీ ఈ క్షణాన్ని గుర్తించం. అది గుర్తించినపుడు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ . అందుకే ఒకే ఒక జీవితం టైటిల్ పెట్టాం. ఒకే ఒక జీవితం మంచి వినోదాత్మక చిత్రం. మదర్ ఎమోషన్ తో పాటు మంచి వినోదం ఇందులో వుంది. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ పాడిన హీరో కార్తి అన్నకి థాంక్స్. ఒక హీరోకి, సినిమాకి హెల్ప్ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ట్రైలర్ ని పోస్ట్ చేసిన ప్రభాస్ అన్నకి కృతజ్ఞతలు. అలాగే ట్రైలర్ ని లాంచ్ చేసిన అనిరుద్ కు థాంక్స్” తెలిపారు.

అమల అక్కినేని మాట్లాడుతూ.. పదేళ్ళ తర్వాత తెలుగు సినిమా చేస్తున్నా. మంచి కథని తీసుకొచ్చి అందులో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీకార్తిక్ కి థాంక్స్. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ప్రభు గారు చాలా ధైర్యంగా మంచి కంటెంట్ ని ఇవ్వాలనే ఉద్దేశం తో ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. శర్వానంద్ కి తల్లిగా చేశాను. ఈ సినిమాతో నా మూడో కొడుకు శర్వా అయ్యాడు (నవ్వుతూ). అయితే ఈ సినిమా అంతా తల్లిప్రేమ గురించి కాదు. అమ్మ ఎల్లప్పుడూ ఉండలేదు కదా. చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ ఈ కథలో వున్నాయి. ఈ సినిమా ముగ్గురి జర్నీ గురించి. ఆ ముగ్గురు కాలంతో ఆడుకుంటూ దాన్ని కరెక్ట్ చేసినప్పుడు విధి మాత్రం మారలేదు. ఇది చాలా స్పెషల్ మూవీ. థియేటర్ కి వెళ్లి చూడండి. మిమ్మల్ని కదిలిస్తుంది. మీలో చాలా పాజిటివ్ వైబ్స్ ని నింపుతుంది. సెప్టెంబర్ 9న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా చూడండి” అన్నారు.

రీతూ వర్మ మాట్లాడుతూ.. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ తో కలసి పని చేయడం ఆనందంగా వుంది. శ్రీకార్తిక్ చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. శర్వానంద్ ఈ పాత్రని చాలా సిన్సియర్ గా చేశారు. అమల గారు నాకు స్ఫూర్తి. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నాజర్ ఇలా చాలా మంచి నటులు ఈ సినిమా కోసం పని చేశారు. సినిమా ఒక సర్ ప్రైజ్ ప్యాకేజీలా వుంటుంది. సెప్టెంబర్ 9న సినిమా విడుదలౌతుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూడాలి” అని కోరారు.

శ్రీకార్తిక్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. మొదట తమిళ్ లో రాశాను. ప్రభు గారు ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. తెలుగు లో కూడా చేద్దామని నాకు నమ్మకం ఇచ్చారు. తరుణ్ భాస్కర్ గారు డైలాగ్స్ రాశారు. నేను తెలుగు వాడ్నే. మా అమ్మ తెలుగు. ఈ సినిమా అమ్మ గురించిన సినిమా ఇది.. కాలంతో ప్రయాణం వుంటుంది. అందరూ కనెక్ట్ అవుతారు. శర్వానంద్ తన నటనతో మీ అందరికీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఇస్తాడు. అమల మేడమ్ గారితో పని చేయడం మర్చిపోలేను. అమల గారు ఈ చిత్రానికి ప్రధాన బలం. రీతూ వర్మ పాత్ర ఇందులో చాలా వైవిధ్యంగా వుంటుంది. ప్రభు గారు అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఈ సినిమా కూడా మరో వైవిధ్యమైన సినిమా అవుతుంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ పాత్రలతో పాటు మిగతా పాత్రలు ఇందులో కీలకంగా వుంటాయి. సిరివెన్నెల లాంటి లెజండరీ రచయిత మా సినిమాకి రాసిన అమ్మ పాట చిరకాలం నిలిచిపోతుంది. ఆయన ఆశీస్సులు మాపై వుంటాయి. సెప్టెంబర్ 9న ఈ సినిమా వస్తోంది. చాలా కొత్త కంటెంట్. మీ అందరికీ కొత్త అనుభూతిని ఇస్తుంది” అన్నారు.

ప్రభు మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ నేపధ్య సంగీతం పాటు చెప్పారు. కథ చెప్పినపుడు చాలా ఎంజాయ్ చేశాం. అప్పుడే మాకు చాలా నమ్మకం వచ్చింది. చాలా అనుభూతిని ఇచ్చే కథ ఇది. శర్వానంద్, అమల, రీతు గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ తో పాటు మిగతా నటీనటులు అద్భుతంగా చేశారు. మయూరి, ఖాకీ, ఖైదీ చిత్రాలని ఆదరించారు. ఇప్పుడు నేరుగా తెలుగు సినిమా చేశాం. సెప్టెంబర్ 9న సినిమా వస్తోంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ కావలి” అన్నారు.