‘చెక్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎస్ఎస్ రాజమౌళి

384

యూత్‌ స్టార్ నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో, హీరోయిన్లుగాఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్యక్రియేషన్స్ బ్యానర్ ‌పై నిర్మాత వీ ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్. ఈ చిత్రం ఫిబ్రవరి 26 తేదీన రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఫిబ్రవరి 21వ తేదీన(ఆదివారం) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్రదర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగాహాజరయ్యారు.

ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. .”ఈ సినిమాలో ఉన్న ఒక్క పాటను విన్నాను. కల్యాణీ మాలిక్ అద్భుతంగా చేశారు. ఒక్క పాట ఈ సినిమాను మరో లెవెల్‌కుతీసుకెళ్తుంది. చంద్రశేఖర్ యేలేటి‌కు ఇది తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకొంటాను. అందుకే చాలా టెన్షన్‌తో ఉన్నారు. ఇక నేను చాలా రోజులు తర్వాత థియేటర్‌కు వెళ్లి చూడాలని ఫీలైన చిత్రం చెక్.  ” అని అన్నారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ..” ఎప్పుడూ రాజమౌళి గురించి మాట్లాడే అవకాశం రాలేదు. ఆయనతో చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ద్వారా వేదికను పంచుకోవడం ఆనందంగా ఉంది. స్కూల్ టైమ్ నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. గొప్పగా కలలు కనాలని మీరుఅందరికీ నేర్పించారు. ఎవరైనా పెళ్లి తర్వాత స్లో అవుతారు. నితిన్ మాత్రం స్పీడ్పెంచారు. నాలుగైదు సినిమాలు ప్రకటించాడు . రెండేళ్ల క్రితం నితిన్ నాకు చెక్ సినిమా కథ చెప్పారు. మధ్యలో ఎప్పుడూ కలిసినా చెక్ సినిమాపై అదే ఫీలింగ్పెట్టుకొన్నాడు. చెక్‌పై మంచి నమ్మకం పెట్టుకున్నాడు . అందుకు తగినట్టే ఈ సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది. చంద్ర శేఖర్ యేలేటి సినిమాలంటే ప్రేక్షకుల్లో, యూత్‌లో మంచి కాన్పిడెన్స్ ఉంటుంది. ఆయన ఆలస్యంగా రేర్‌గా సినిమాలు తీస్తుంటారు . కానీ అవిప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. చెక్ సినిమా కూడా మీ కెరీర్‌లో పెద్ద బ్లాక్‌బస్టర్కావాలని కోరుకొంటున్నాను” అని చెప్పారు .

హీరో నితిన్ మాట్లాడుతూ.. చెక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి, రమక్క (రమ రాజమౌళి)కు ధన్యవాదాలు. ఇక వరుణ్ తేజ్ నాకు ట్రూ ఫ్రెండ్. రాజమౌళి గారు తెలుగు సినిమాను ప్రపంచ పటంపై పెట్టారు. అలాంటి మీతో నేను మీరు రూపొందించిన ‘ సై’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. నా కెరీర్‌లో గుర్తుంచుకొనే చిత్రంగా మిగిలింది . ‘సై’ చిత్రం కూడా రగ్బీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. ఇప్పుడు చెక్ సినిమా కూడా క్రీడా నేపథ్యం ఉన్నచిత్రం కావడం హ్యాపీగా ఉంది.

ప్రియా ప్రకాశ్ వారియర్ మాట్లాడుతూ.. చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడం నాకు చాలాఆనందంగా ఉంది. హైదరాబాద్ ‌నాకు రెండో ఇల్లుగా మారింది. తెలుగులో బెటర్ లాంచ్ జరిగిందని భావిస్తున్నాను. నితిన్ నాకు అమేజింగ్ కో స్టార్. నాపై ఎంతో నమ్మకంపెట్టుకొన్న నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారికి, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి నా ధన్య వాదాలు. చిన్నప్పటి నుంచి ఇలా హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందు నిలబడాలన్నది నాడ్రీమ్. ఈ వేడుకకు వచ్చిన రాజమౌళి, వరుణ్ తేజ్‌కు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను” అనిఅన్నారు.

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ.. ఈ సినిమావేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన వరుణ్ తేజ్, ఎస్ఎస్ రాజమౌళికి ధన్యవాదాలు. చివరి నిమిషంలో ఆహ్వానించినప్పటికి, ఆయన తన ముఖ్యమైన పనులను వదులుకొని ఈ వేడుక కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నితిన్ ఫ్యాన్స్‌కు ఒక్కటే చెప్పదలచుకొన్నాను. చెక్ సినిమా ఎవరినీ నిరాశ పరచదు. చెక్ సినిమా అందరూచూడాలని కోరుకొంటున్నాను” అని అన్నారు.

ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ… చెక్ యూనిట్‌ను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అగ్రదర్శకులు ఎస్ఎస్ రాజమౌళికి, వరుణ్ తేజ్, గోపిచంద్ మలినేని, వెంకీ కుడుములకు ధన్య వాదాలు. కరోనా సమయంలో 2020 సంవత్సరంలో మేము ఓ పిట్టకథ, మిడిల్ క్లాస్మెలోడిస్ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి మంచి హిట్లను సాధించాం. ఇలాంటిరెండు విజయాల తర్వాత మేము చెక్ సినిమాతో ముందుకు వస్తున్నాం. నాకు ఇష్ట మైనడైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి,  . మళ్లీ ఈ చిత్రంలో వారిద్దరు కలిసి నటించడం మాకు సెంటిమెంట్‌గామారుతుందని భావిస్తున్నాను” అని నిర్మాత ఆనంద ప్రసాద్ అన్నారు.విషయానికి వస్తే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నితిన్‌కు భీష్మ కంటే పెద్ద సక్సెస్ లభిస్తుంది. భవ్య క్రియేషన్స్ నాకు ఫ్యామిలీ ప్రొడక్షన్లాంటింది. నిర్మాత ఆనంద్ ప్రసాద్ చాలా సింపుల్‌గా ఉంటారు. లౌక్యం కంటే పెద్ద హిట్అవుతుంది” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అన్నే రవి , ప్రముఖ పంపిణీ దారుడు వరంగల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు