డాక్టర్ కె.వి.రమణాచారి ” నాగాస్త్ర పేరిట నృత్య నాటక కళాకారుల షో రూమ్ ను ప్రారంభించారు’

463

జ్యోతి ప్రజ్వలన చేసి నాగాస్త్ర ప్రారంభించి శోభానాయుడు కు నివాళులు అర్పించిన డాక్టర్ కె వి రమణాచారి, డాక్టర్ మహ్మద్ రఫీ, డాక్టర్ ఓలేటి పార్వతీశం, శ్రీ బి.నాగయ్య  తదితరులు

నృత్య నాటక కళాకారుల ఆహార్యానికి సంబంధించిన దుస్తులు, ఆభరణాలు, అలంకరణ సామాగ్రి తో నాగాస్త్ర కళకళ లాడుతున్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. కరోనా తో కుదేలయిన కళారంగం నాగాస్త్ర తో మళ్ళీ పునర్వైభవం కావాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా నాగాస్త్ర పేరిట నృత్య నాటక కళాకారుల షో రూమ్ ను ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ కె.వి.రమణాచారి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా నాగయ్య ను దివంగత శోభానాయుడు ప్రపంచానికి పరిచయం చేశారని, ఆమె ఉండి ఉంటే ఎంతో సంతోషించే వారని అయన అన్నారు. నాగాస్త్ర దిగ్విజయం కావాలని, కళాకారులు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాస్ట్యూమ్ డిజైనర్ బి. నాగయ్య మాట్లాడుతూ 40 ఏళ్లుగా నృత్య కళాకారులకు దుస్తులు అందిస్తున్నా అని, ఇప్పుడు ఆధునిక హంగులతో మరింత అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ వేడుక లో జయ జయ శంకర టీవీ సీఈఓ డాక్టర్ ఓలేటి పార్వతీశం, కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ, ప్రజా గాయని సుద్దాల భారతి, సుజాతామూర్తి, ఓలేటి హైమావతి, బి.మానస, సురభి రఘునాథ్, సురభి కిషోర్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.