హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ గా మహ్మద్ రఫీ

464

కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన జాతీయ మానవ హక్కుల సంఘం దక్షిణ భారత చైర్మన్ గా సీనియర్ పాత్రికేయులు డాక్టర్ మహ్మద్ రఫీ నియమితులయ్యారు. ఈమేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు జితేంద్ర కుమార్ (ఢిల్లీ) నియామక పత్రం విడుదల చేశారు. మహ్మద్ రఫీ ఈ పదవి లో సంవత్సరం పాటు కొనసాగుతారు. తనపై నమ్మకం తో ఇంతటి బాధ్యత ను అప్పగించినందుకు మహ్మద్ రఫీ ధన్యవాదాలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో మానవ హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధి తో కృషి చేస్తానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.