కార్తి ‘ఖైదీ’ ఈ దీపావళికి కల్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది – శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌

519

యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్స్‌ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా..
శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ – ”దీపావళి శుభసందర్భంగా రిలీజైన మా ‘ఖైదీ’ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఇలాంటి ఒక డిఫరెంట్‌ సినిమాని యాక్సెప్ట్‌ చేసి ఎంతో నమ్మకంగా చేసిన హీరో కార్తిగారికి, అలాగే ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు ప్రకాష్‌బాబు, ప్రభు, వివేక్‌లకు కృతజ్ఞతలు. ఒక సినిమా సక్సెస్‌ అయ్యి, మంచి రేటింగ్‌తో పాటు మంచి మౌత్‌ టాక్‌ ఉంటే ఆ సంతోషమే వేరు. ‘బెంగాల్‌ టైగర్‌’ తర్వాత ప్రేక్షకులు మాకు ఇచ్చిన దీపావళి గిఫ్ట్‌ ‘ఖైదీ’. ఈ సినిమాలో హీరోయిన్‌, పాటలు లేకపోయినా రెండు గంటల ఇరవై నిమిషాలు ప్రేక్షకుల్ని ఎంగేజ్‌ చేసిన దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ని అభినందిస్తున్నాను. తనకి ఇది రెండో సినిమా. ఫస్ట్‌ సినిమా ‘నగరం’ కూడా రాత్రి నేపథ్యంలోనే ఉంటుంది. మంచి హిట్‌ అయ్యింది. ఒక రాత్రి నాలుగు గంటల్లో జరిగే కథ అయినా చిత్రాన్ని స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు అడియన్స్‌లో క్యూరియాసిటీ కలిగించారు. ‘ఖైదీ’ సినిమాకి రివ్యూస్‌ చాలా గొప్పగా వచ్చాయి. ఈరోజు కలెక్షన్స్‌ ఇంకా పెరిగాయి. మా డిస్ట్రిబ్యూటర్స్‌ ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. ఈ దీపావళికి ప్రేక్షకులు మాకు ఇచ్చిన కల్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఖైదీ’.