త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన పవన్ కళ్యాణ్..!

603

74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు జాతీయ పతాకానికి వందనం చేసిన అనంతరం భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు సుమాంజలి అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, తెలంగాణ ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ పార్టీ ముఖ్య నేతలు శ్రీ షేక్ రియాజ్, శ్రీ వై.నగేష్, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.