సర్కారు వారి పాట’తో మళ్ళీ మనందరికీ పండగే: సూపర్ స్టార్ మహేష్ బాబు

502

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులు కేరింత మధ్య హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సహా చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు.. ప్రముఖులు అతిధులుగా పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆద్యంతం అలరించించింది.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ.. రెండేళ్ళ తర్వాత అభిమానులని ఈ వేడుక ద్వారా కలుసుకోవడం ఆనందంగా వుంది. దర్శకుడు పరశురాం గారు సర్కారు వారి పాటలో నా పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్ని కొత్తగా, వినోదాత్మకంగా వుంటాయి. కొన్ని సీన్లు చేస్తున్నపుడు పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి. పరశురాంకి కథ ఓకే చెప్పిన తర్వాత ఇంటికి వెళ్లి నాకో మెసేజ్ పెట్టారు. ” ఒక్కడు సినిమా చూసి డైరెక్టర్ అవుదామని వచ్చాను. మీరు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఎలా తీస్తానో చూడండి” అన్నారు. ఆయన చెప్పినట్లే అద్భుతంగా తీశారు. నా
అభిమానులకు, నాన్న గారి అభిమానులకు పరశురాం ఒక అభిమాన దర్శకుడు అవుతారు. సర్కారు వారి పాటలో చాలా హైలెట్స్ వుంటాయి.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. మహేష్ గారు మాకు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్తర్ హిట్ ఇచ్చి ఇండస్ట్రీలోకి గ్రాండ్ వెల్ ఇచ్చారు. మహేష్ గారితో మరిన్ని సినిమాలు చేయాలనీ వుంది. దర్శకుడు కథ చెప్పినప్పటి నుంచి జర్నీ ఒక పండగలా జరిగింది.

నిర్మాత రామ్ ఆచంట మాట్లాడుతూ..  పరశురాం గారు మహేష్ బాబుగారి అద్భుతంగా ప్రజంట్ చేశారు. మే 12 అభిమానులకు ఒక పండగలా వుంటుంది”అన్నారు