ఫిబ్రవరి 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ‘3E’

457

బచ్చు కొండలు సమర్పణలో ‘100 క్రోర్ బడ్జెట్ ఫిల్మ్స్’ పతాకంపై దైనందిన జీవితంలో జరిగిన నేరాలకు సంబంధించిన కథాంశంతో రూపొందిన చిత్రం ‘3E’. విశ్వనాధ్. బి దర్శకత్వంలో వేణు బచ్చు నిర్మించారు. వాస్తవ ఘటనలతో అనేక క్రైమ్ కథల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు చిత్ర విడుదల విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత ప్రపంచంలో క్రైమ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి క్రైమ్‌కి సంబంధించి ఫైల్ అయిన కేసుల స్పూర్తితో ఓ అద్భుతమైన కథను తయారుచేయడం జరిగింది. సినిమా అంతా చాలా బాగా వచ్చింది. చూస్తున్న ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఫిబ్రవరి 4వ తేదీన చిత్రాన్ని విడుదల చేయబోతున్నాము. అందరినీ ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుతున్నాము..’’ అని తెలిపారు.

నూతన నటీనటులతో రూపొందిన ఈ చిత్రానికి..
ప్రొడక్షన్ మేనేజర్: వెంకట్ రాపోలు,
ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్స్: సతీష్ బచ్చు, వసంత్ కుమార్,
ఎడిటింగ్: సంపత్ కుమార్ ఐలాపురం,
సంగీతం: అర్మాన్ మెరుగు,
సినిమాటోగ్రఫీ: గురుప్రసాద్. జె,
నిర్మాత: వేణు బచ్చు,
కథ, దర్శకత్వం: విశ్వనాధ్. బి.